సినిమా రంగంలోకి అద్భుతంగా రీఎంట్రీ ఇచ్చి, తన రీఎంట్రీలో దుమ్ము దులుపుతున్న మెగాస్టార్ చిరంజీవి.. సరికొత్తగా చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు యావత్ సినీ ప్రపంచమే వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. రాంచరణ్ పాత్ర దాదాపు 40 నిమిషాల నిడివి ఉంటుందని, ఇది సినిమాలో చాలీ కీలకమైన పాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తోంది. అయితే కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విషయం తెలిసిందే.

అంతే కాకుండా సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంటుంది. ఇటీవల కాజల్‌ను ఆచార్య సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. ‘ఈ సినిమాలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పాత్రలో చేసి చాలా కాలం గడిచిపోయింది. నేను ఇటువంటి పాత్రలను చాలా మిస్ అవుతున్నాను. లాక్‌డౌన్ కారణంగా ఇటువంటి పాత్రలపై నాకున్న ఇష్టం మరింతగా పెరిగింద’ని కాజలు బదులిచ్చింది. ఇదిలా ఉంటే ఆచార్య సినిమాలో కాజల్ పాత్రకు ముందుగా త్రిష కృష్ణణ్ ‌ను సంప్రదించారు. కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్ర కాజల్ చెంతకు చేరింది. ఏది ఏమైనా ఇలాంటి పాత్రలు చేయడం ఎన్నటికీ మరువలేని జ్ఞపకం అని కాజల్ సమాధానం ఇచ్చింది. చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో కూడా కాజలే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈ భామ మెగాహీరోల్లో దాదాపు అందరితోనూ ఆడి పాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: