కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ ఇంకా అలాగే ‘ఐ’ వంటి సినిమాలతో ఇక్కడ విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.తెలుగులో విక్రమ్‌కు టాలీవుడ్ హీరోలకున్నంత క్రేజ్ కూడా ఉంది. ఇంకా ఫ్యాన్స్ కూడా వున్నారు.అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడం లేదు. ఈ క్రమంలో తన కొడుకు ధృవ్‌తో కలిసి ‘మహాన్’ చిత్రంలో నటించాడు. ఫిబ్రవరిలో నేరుగా అమెజాన్‌లో విడుదలైన ఈ సినిమా హిట్ అయ్యి మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. కానీ ఈ చిత్రం ఓటీటీలో విడుదలవడంతో విక్రమ్ అభిమానులు అయితే చాలా తీవ్రంగా నిరాశపడ్డారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు విక్రమ్ ‘కోబ్రా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ఇంకా టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.


ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించడం జరిగింది.అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సమాచారం తెలుస్తుంది. కోబ్రా సినిమాకు సంబంధించిన సీజి వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదట. దాంతో ఈ మూవీ మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట.గతంలో రూమర్ అనే వార్తలు వచ్చిన ఇది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ హాట్ భామ అయిన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్‌.ఎస్‌. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రముఖ క్రికెటర్ అయిన ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: