ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ మూవీ తో అల్లు అర్జున్ అద్భుతమైన క్రేజీ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో సంపాదించుకున్నాడు. పుష్ప ది రైస్ మూవీ లో అల్లు అర్జున్ నటన కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. పుష్ప ది రైస్ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది.  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ,  ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు.

సునీల్ ,  అనసూయ , రావు రమేష్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం పాన్ ఇండియా రేంజ్ లో సాధించడంతో దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే పుష్ప ది రైజ్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ,  ఇప్పటికి కూడా పుష్ప ది రోల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం నవంబర్ 12 వ తేదీ నుండి పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ బ్యాంకాక్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ లో ఈ మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రైస్ మూవీ ని నిర్మించిన దాని కంటే , ఎక్కువ బడ్జెట్ తో మరియు ఎక్కువ రిచ్ గా పుష్ప ది రూల్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: