ఎగ్జిబిటర్ లు థియేటర్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్త వినగానే సినీ ప్రియులతో పాటుగా, నిర్మాతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఏపీ, తెలంగాణలో సినిమా థియేటర్ లను ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ లను బంద్ చేయాలని ఇష్యూ నడుస్తుంది. అయితే ఈ విషయంపై సినిమా ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ లు సమావేశం అవ్వడం. నిర్మాతలు, ఎగ్జిబిటర్ చర్చలు జరపడం జరిగింది. ఆ మీటింగ్ లో సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే తెలుగు రాష్ట్రాలలో థియేటర్ లు బంద్ చేస్తామని వెల్లడించారు.
 
అయితే ఇటీవల మరోసారి మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిర్మాత దిల్ రాజు సత్యనారాయణ పేరు చెప్పారు. దీంతో జనసేన పార్టీలో కలకలం మొదలైంది. ఈ కారణంగా రాజమండ్రి సిటీ ఇంచార్జ్ పదవితో పాటుగా పార్టీ నుండి కూడా అత్తి సత్యనారాయణను తొలగించడం జరిగింది. నిజాలు అన్నీ తెలిసే వరకు అతి సత్యనారాయణ పార్టీకి దూరంగా ఉండాలని వెల్లడించారు.

 
ఇక జనసేన నుండి బహిష్కరణకు గురైన అతి సత్యనారాయణ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియా మీటింగ్ లో మాట్లాడుతూ.. జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేయాలని ప్రకటించారని అన్నారు. థియేటర్ ల బంద్ గురించి దిల్ రాజు తమ్ముడు మాట్లాడాడని అన్నారు. ఆయన తమ్ముడిని రక్షించుకోవడం కోసం తనని కావాలనే ఇరికించారని స్పష్టం చేశారు. దిల్ రాజ్ నటనలో కమల్ హాసన్ ని మించిపోయారని.. ఆస్కార్ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇస్తున్నారని ఆరోపించారు. దుర్దేశంతోనే తన పేరు చెప్పారని అన్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో జనసేన పేరు ఎత్తారని చెప్పుకొచ్చారు. తను థియేటర్లను బందు చేయాలని ఎక్కడ అనలేదని అతి సత్యనారాయణ స్పష్టం చేశారు. మరి ఈ ఇష్యూ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: