వార్ 2 సినిమాకి రిలీజ్ కి ముందే కొత్త కష్టాలు ఎదురవుతున్నాయా..? అంటే ఎస్ అన్న  సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బిగ్ బడా ప్రాజెక్ట్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ పాత్రలో .. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో తాజాగా నటించిన సినిమానే ఈ వార్ 2.  ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్ గా  థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . తమిళ్ - తెలుగు - హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .


సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ మేకర్స్ . అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్  అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే ముందే మూడుసార్లు ట్రిమ్మింగ్ చేయడం బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ముందుగా ఈ సినిమాకు 152 నిమిషాల 49 సెకండ్ల నిడివి లాక్ చేశారు మూవీ మేకర్స్.  సెన్సార్ కూడా పూర్తి చేసేశారు . ఆ తర్వాత కొన్ని రోజులకే మనసు మార్చుకున్న మూవీ మేకర్స్ సినిమా నుంచి దాదాపు తొమ్మిది నిమిషాల ఫుటేజ్ ని తొలగించారు.  తిరిగి మళ్ళీ సెన్సార్ చేయించారు.



అయితే ఈ తొమ్మిది నిమిషాల ఫుటేజ్ కారణంగా దాదాపు 34 కోట్ల నష్టం వచ్చింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది . అయితే రెండవసారి రన్ టైం 173 నిమిషాల 24 సెకండ్లకు ఫిక్స్ అయ్యింది. హిందీ వర్షన్ కొద్దిగా ఫిక్స్ చేశారు . అంత సెట్ అనుకున్నా మూమెంట్లో వార్ 2 సినిమా మరొకసారి ట్రిమ్మింగ్ బారిన పడ్డింది . ఈసారి మరో రెండు నిమిషాల సన్నివేశాలు కట్ చేశారు. ఇది హై యాక్షన్ సీన్స్ అంటూ టాక్ వినిపించింది.  దీనికారణంగా ఏకంగా  14 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ టాక్  వినిపించింది .



ఫైనల్లీ ముచ్చటగా మూడోసారి 171 నిమిషాల 44 సెకన్ల రన్ టైం ఫిక్స్ చేశారు . ఇది తెలుగు వర్షన్ కోసం.  ఇలా సినిమాను ఇప్పటివరకు మూడుసార్లకు ట్రిమ్ చేసి సుమారు 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా చేసుకున్నారు మూవీ మేకర్స్ అంటున్నారు బాలీవుడ్ స్పెషలిస్టులు . తాజా సమాచారం ప్రకారం కియరా అద్వానికి చెందిన కొన్ని సన్నివేశాలు తెలుగు వర్షన్ లో కట్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా సగం సినిమా ట్రిమింగ్ లతోనే లేపేశారు అన్న కౌంటర్స్ కూడా పడుతున్నాయ్. చూడాలి మరి సినిమాకి ఎలాంటి టాక్ వినిపిస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: