ఎందుకీ వైఫల్యం..
ఎండాకాలంలో ఎక్కువగా కారుల్లో మంటలు వస్తున్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. కానీ ఈ వేసవి మొదలు కాగానే.. ఎలక్ట్రిక్ స్కూటర్లు మండిపోతున్నాయి. ఓవైపు పెట్రోల్ రేట్లు మండిపోతుండటంతో.. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మారుతున్నారు. వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో చాలావరకు వాహనాల్లో ఉంచిన లిథియం అయాన్ బ్యాటరీలే కారణం అని తేలుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో సంప్రదాయ లెడ్-యాసిడ్ బ్యాటరీలు వాడేవారు. ఆ తర్వాత లిథియం-అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. వీటి నాణ్యత, మన్నిక చాలా ఎక్కువ కావడంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఒక కిలో బరువుండే లిథియం-అయాన్ బ్యాటరీలో 150 వాట్-అవర్స్ స్టోరీ చేసుకోవచ్చు, దానితో బండి నడిపించొచ్చు. వీటి ఫుల్చార్జింగ్ కు కూడా ఎక్కువ సమయం పట్టదు. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
అయితే ఈ బ్యాటరీల వల్ల కొంత నష్టాలు కూడా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్, లో ఓల్టేజీ, హై ఓల్టేజీ వల్ల కూడా లిథియం-అయాన్ బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎర్త్ లేని ఇళ్లలో బ్యాటరీలను చార్జ్ చేస్తే.. వైరింగ్ లో లోపాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంది. షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువగా అవకాశముంటుంది. ఆ సందర్భాల్లోనే బ్యాటరీల పేలుళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఓవర్ చార్జింగ్, ఓల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని అంటున్నారు. మరి వీటిని నివారించడం ఎలా..?
ప్రస్తుతం వీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లను వాయిదా వేస్తున్న్టటు తెలుస్తోంది. అయితే ఈ-స్కూటర్లను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందని, కొంతమంది పాత కస్టమర్లు కూడా చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఈ-స్కూటర్లను వాడేవారు కూడా ఉన్నారు. వారంతా వీటివల్ల ప్రమాదం లేదంటున్నారు. మరి ఇటీవల జరిగిన ప్రమాదాల వల్ల మాత్రం వినియోగదారుల్లో కొంత గందరగోళం ఏర్పడినమాట వాస్తవం.