విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలిలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే.. సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పాను. మానవతా కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాను. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాట్రన్ అంటూ ఏమీ లేదు. 2016లో 6 గురు చనిపోతే..2019లో నలుగురు చనిపోయారు. 2021లో 7గురు చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17మంది, 2024లో 6గురు చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాదని ఎవరూ అనడం లేదు. ఇవన్నీ ఇంటర్ విద్యలో చోటుచేసుకున్నవి. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఒకేడాది ఒకరిద్దరు చనిపోతే, మరో ఏడాది 11 మంది, మరో ఏడాది ఒకరు చనిపోయారు. దీనికి ప్యాట్రన్ లేదు. యూనివర్సిటీల్లో కూడా ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి 18 మంది చనిపోయారు.


విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్ నెస్ టీమ్స్ ఏర్పాటు...
స్కూల్ వెల్ నెస్ టీమ్స్ ఏర్పాటుచేసి ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీయర్ సింప్టమ్స్ ను క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్స్ ను నియమించాం. వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సింప్టమ్స్ ను, పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి, సరిచేయడంతో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన క్యూపీఆర్ ఇన్ స్టిట్యూట్ వారు బెంగళూరులో ఓ పార్ట్ నర్ తో ఒప్పందం చేసుకున్నారు. స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కోసం గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్ మెంట్ కు వారితో సంప్రదిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలీ కౌన్సిలింగ్ సర్వీస్ ఏర్పాటుచేస్తాం. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే.. మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్ సీసీ, రెడ్ క్రాస్ ను కూడా పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్ సీసీ డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారిని కూడా కోరడం జరిగింది. రెప్యుటెడ్ ఎన్జీవోస్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆత్మహత్యలు నివారించాలని, పిల్లల్లో ఎర్లీ సింప్టమ్స్ ను గుర్తించాలని మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది.


ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేస్తాం...
విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మహత్యలకు ర్యాగింగ్, అకడమిక్ స్ట్రెస్, ఫీజు చెల్లింపులు ప్రధాన కారణం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గత ప్రభుత్వం హైస్కూల్ ప్లస్ తీసుకువచ్చారు. అక్కడ సబ్జెక్స్ టీచర్స్ ను ఇవ్వాలి. మండలానికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉండాలి. మేం ఇంటర్ విద్యార్థులకు కిట్ తో పాటు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.


ప్రైవేటు యాజమాన్యంపైనా బాధ్యత ఉంది...
తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్ట్ ల్లో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం. కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. కరిక్యులమ్ రీవ్యాంప్ చేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఆత్మహత్యలు చోటుచేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేటు, గవర్నమెంట్ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేటు యాజమాన్యంపై కూడా బాధ్యత ఉంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని వాకబు చేస్తున్నాం. హ్యుమిలియేషన్ ను కూడా తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.


విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం...
ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేసి పరిశ్రమలకు అనుసంధానించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు, బోధనను మెరుగుపర్చడంతో పాటు, ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వమే అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పాఠశాలల్లో యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే ఏడాది నుంచి వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటుచేస్తాని, స్కూల్స్ గ్రౌండ్స్ అన్నీ మ్యాప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap