
మళ్ళీ ఇప్పుడు 2025లో, ఇప్పుడు ఆర్సీబీ తరఫున పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో బౌలింగ్లో మెరుపులు మెరిపించారు. 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా, పంజాబ్ రన్స్ చేసే వేగాన్ని దెబ్బతీశారు. ఈ అద్భుత ప్రదర్శనకు మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సత్కరింపబడ్డారు. ఈ రెండు విభిన్న ప్రదర్శనలు ఒకటి బ్యాటింగ్లో, మరొకటి బౌలింగ్లో ఐపీఎల్ ఫైనల్స్లో విశేషంగా నిలవడం అనేది కృనాల్ పాండ్యా ఆల్రౌండ్ నైపుణ్యానికి నిదర్శనం. ఒకే ఆటగాడిగా రెండు ఫైనల్స్లో ఈ అవార్డు అందుకోవడం ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి జరగడం గమనార్హం.
ఈ ఘనతతో కృనాల్ పేరు IPL చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అభిమానులు ఆయనను కేవలం హార్దిక్ అన్నయ్యగా కాకుండా, ఐపీఎల్ లెజెండ్గా గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి 18 ఎల్లా ఆర్సీబి కళను నెరవేరుస్తూ కృనాల్ పాండ్యా విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మరోవైపు 18 ఏళ్ల కళను పంజాబ్ ఈసారి కూడా అందుకోలేక నిరాశలో ఉండిపోయింది.