ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. గత పదేళ్లుగా 229.66 ఎకరాలు మాత్రమే వినియోగించారని అందువల్లే మిగిలిన భుమిని వెనక్కు తీసుకుంటున్నామని జగన్ సర్కార్ పేర్కొంది. అమర్ రాజా కంపెనీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. 
 
అగ్రిమెంట్‌లో చెప్పిన విధంగా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టడంలో కానీ, 20 వేల ఉద్యోగాల కల్పనకు చేసిన హామీలను అమర్ రాజా కంపెనీ నిలబెట్టుకోలేదని జగన్ సర్కార్ చెబుతోంది. 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కంపెనీ కేవలం 4,310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందనే ఆరోపణలతో జగన్ సర్కార్ మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం ఉత్తర్వులను జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: