ఇది సోషల్ మీడియా యుగం.. గతంలో వైసీపీ సోషల్ మీడియా చాలో జోరుగా ఉండేది.. అదే వైసీపీకి బలంగా మారింది. అందుకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ  సోషల్ మీడియాను బలోపేతం చేశారు. ఇటీవల పార్టీ విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడంలో ఐ-టీడీపీది కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు ఆశిస్తున్నారు.

నాయకులు ప్రత్యక్షంగా తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యం. అంతే కాదు..  పార్టీ విధానాలను, వాణిని బలంగా వినిపించడంలో ఐ-టీడీపీది కీలక పాత్ర కానుంది. వచ్చే ఎన్నికల్లో ఈ విభాగం మరింత కీలకం కానుందని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి.. జగన్ సర్కార్ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపడంలో, విమర్శలను తిప్పి కొట్టడంలో ఐ-టీడీపీ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

TDP