నేటి రోజుల్లో మనుషులు సాటి మనుషుల విషయంలో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎక్కడ మానవత్వం బ్రతికే ఉంది అని మాత్రం అనిపించడంలేదు ఎవరికీ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు సెల్ఫోన్ దొంగలించాడు అంటూ స్థానిక ప్రజలందరూ ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మరింత రాక్షసానందం పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఒక లారీకి ముందు భాగంలో తాళ్లతో అతని కట్టేశారు. ఇక ఆ తర్వాత ఆ లారీని ఎంతో వేగంగా ముందుకు నడిపించారు.
దీంతో ఆ యువకుడు తీవ్ర భయాందోళనకు గురై మీకు దండం పెడతా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. నన్ను దింపండి అంటూ ఎంత వేడుకున్నా అక్కడున్న వారు కనికరించలేదు. ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో తీశారు. తప్ప అయ్యో పాపం అని మాత్రం ఎవ్వరూ అనలేదు అని చెప్పాలీ. ఈ ఘటన కటక్ జగత్సింగ్పూర్ జిల్లా పరదీప్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. యువకుడు ఫోన్ దొంగలీస్తున్న సమయంలో చూసిన లారీ డ్రైవర్లు అతన్ని ఒక లారికీ ముందు భాగంలో కట్టి రాక్షస ఆనందం పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..