బాలీవుడ్ లో కాంట్రవర్సీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో సంజయ్ దత్.. తాజాగా షిరిడీ సాయినాథున్ని దర్శించుకున్నారు.  ప్రముఖ నటులు నర్గీస్, సునీల్ దత్ కుమారుడైన సంజయ్ దత్ బాల నటుడిగా కెరీర్ ఆరంభించి తర్వాత రాఖీ మూవీతో హీరోగా మారారు.  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ముంబాయి బాంబు పేళుళ్ల సందర్భంగా ఏకే 47 గన్ తన కలిగి ఉన్నాడని టాడా చట్టం కింద అరెస్ట్ అయి.. చాలా సంవత్సరాల జైలు జీవితం గడిపారు.  ఇటీవల ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.  ఆ మద్య బాలకృష్ణ నటిస్తున్న ఓ మూవీలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.  ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెడుతున్న ఆయన తన జైలు జీవితం ఎన్నో మార్పులు తెచ్చిందని అంటున్నారు. 

 

ఈ మద్యనే రీసెంట్‌గా షిర్డీ సాయిబాబా ఆల‌యాన్ని సంద‌ర్శించారు. బాబాకి న‌మ‌స్కారం చేసి ప్రార్ధ‌న‌లు జ‌రిపిన ఆయ‌న ఆలయంలో పూజ‌లు కూడా చేశారు. బాబా పాదాలు మొక్కి ఆశీర్వాదం కూడా పొందారు. షిర్డీ సాయి సంస్థానం ట్ర‌స్ట్ సీఈఓ దీప‌క్ ముగ్లిక‌ర్ సూప‌ర్ స్టార్‌ని షాలువాతో స‌త్క‌రించి బాబా విగ్ర‌హాన్ని అందించారు. షిర్డీ సాయి సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. ఇక్కడ మనసు ఎంతో ప్రశాంతత ఇస్తుందని ఆయన అన్నారు. షిర్డీ సాయిబాబాని ద‌ర్శించుకునేందుకు సంజ‌య్ ద‌త్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు అక్క‌డికి భారీగా చేరుకున్నారు.

 

అత‌నితో సెల్ఫీలు దిగేందుకు పోటీప‌డ్డారు. ఇటీవ‌ల రాణీ మ‌ఖ‌ర్జీ కూడా బాబా ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ప్రస్తుతం సంజయ్ దత్  అషుతోష్ గోవ‌ర్క‌ర్ పీరియ‌డ్ డ్రామా పానిప‌ట్‌లో చివ‌రిగా క‌నిపించిన సంజ‌య్ ద‌త్ త్వ‌ర‌లో భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, పృథ్వీరాజ్‌, టోర్భాజ్ మూవీలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సంజూబాబా మంచి విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: