పాపం యాంకర్ భానుశ్రీ కి ఇక్కడ బుల్లి తెర కలిసి రావడం లేదు. అక్కడ సినిమాలు కలిసి రావడం లేదు. సినిమాలలో ఎంతగా గ్లమర్ ని ఒలకబోసిన, లిప్ కిస్సులిచ్చినా, ఎక్స్‌ఫోజింగ్ చేసినా హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకొలేకపోతోంది. చిన్న చిన్న సినిమాలలోనైనా అవకాశాలు దొరికి అలా అలా నెట్టుకొచ్చి హీరోయిన్ గా సెటిల్ అవుదామని ఎంతో తాపత్రయపడుతోంది. పాపం ఏడు చేపల కథ సినిమాలోనూ చాలానే చేసింది. అయినా ఆ క్రెడిట్ మొత్తం హీరోకి పక్కన వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈ సినిమాలో పెద్ద మైనస్ ఏడు చేపలన్నట్టుగా ఏడుగురిలో ఒక హీరోయిన్ గా నటించడం పెద్ద పొరపాటు మైనస్.

 

సినిమాల సంగతి ఇలా ఉంటే టీవీ షోస్ కూడా భాను కి కలిసి రావడం లేదు సంచుల కొద్ది తన మీద పంచులేపించుకుంటున్నప్పటికి ఆ క్రెడిట్ తన ఖాతలోకి పడటం లేదు. ఇక్కడ కూడా భానుకి రావాల్సిన క్రెడిట్ పక్కవాళ్ళు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఏ ఒక్క షోలోను పట్టు మని పది వారాలు కంటిన్యూస్ గా ఉండలేకపోతోంది. స్టార్ యాంకర్ ఎవరూ అందుబాటులో లేకపోతేనో లేదా కొన్నాళ్ళు ఎపిసోడ్స్ ని ఎంగేజ్ చేయడానికో ఉపయోగించుకుంటున్నారు తప్ప మేయిన్ యాంకర్ గా మాత్రం ప్లాట్ ఫాం ఇవ్వడం లేదు.

 

ఇప్పుడు కూడా ఒక షో లో అలానే భాను శ్రీ ని తీసుకున్నారని అంటున్నారు. మొన్నటి వరకు నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్న అదిరింది షో లో యాంకర్ గా సమీరా చేసిన సంగతి తెలిసిందే. అయితే తన వల్ల రేటింగ్ రావడం లేదని షోలో సమీరా పెద్ద మైనస్ అన్న కామెంట్స్ రావడంతో సమీరా ని తప్పించి ఆ ప్లేస్ లో రవి, భాను ని తీసుకున్నారు. అయితే ఇలా భాను ని తీసుకుంది కొన్ని ఎపిసోడ్స్ కే అని షాకిచ్చారట. దాంతో భాను ఖంగుతినిందట. కొన్ని ఎపిసోడ్స్ భాను శ్రీ ఎంగేజ్ చేస్తే ఆ తర్వాత తన ప్లేస్ లో రష్మీ గాని అనసూయ గాని రానుందని అంటున్నారు. పాపం భానుశ్రీ పరిస్థితి ప్రతీసారి ఇలానే ఉంటోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: