సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ బడా బాబుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. సుశాంత్ కి మద్దతుగా నెటిజనులు బాలీవుడ్ స్టార్స్ ని, వారి కిడ్స్ ని సోషల్ మీడియా సాక్షిగా ఏకిపడేస్తున్నారు.అసలు ఏం జరిగిందో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూడండి.  ఇక పోతే బాలీవుడ్ కేంద్రంగా డ్రగ్స్ కేసు ఎంత సీరియస్ గా నడుస్తుందో తెలిసిందే. డ్రగ్స్ ఆరోపణలపై బాలీవుడ్ లో అరెస్ట్ ల పరంపర కొనసాగుతుంది. సుశాంత్ సింగ్ రాజపుత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్న మరో 15మంది వరకు అరెస్ట్ కాబడ్డారు. ఈ కేసు వాడివేడిగా నడుస్తుండగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంచరించుకుంది. అసలు బాలీవుడ్ లో ఏమి జరుగుతుందని ప్రజలు మొత్తం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

కంగనా రనౌత్ మరియు, నటుడు మరియు ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ పై డ్రగ్ ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లో డ్రగ్ కల్చర్ అధికంగా ఉందని, దీనిపై ద్రుష్టి సారించాలని చెప్పడం జరిగింది. బాలీవుడ్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలను అమితాబ్ సతీమణి జయా బచ్చన్ ఖండించారు. అలాగే బాలీవుడ్ లో అందరూ డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎవరో కొందరు చేసిన నేరానికి మొత్తం బాలీవుడ్ ని ఇందులోకి రావడం సరికాదని విమర్శించారు.

ఈ సంఘటన జరిగి అది మరువక ముందే జయాబచ్చన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అలాగే ఆమె కూతురు శ్వేతా బచ్చన్ అధిక మోతాదులో మద్యం తాగి ఓ బార్ నుండి బయటికి వస్తున్న వీడియో ట్రెండ్ చేస్తూ… ఇప్పుడేమంటారు అని జయాబచ్చన్ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఆమె చేసిన ఈ పని వల్ల అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ పరువు పోయింది. అసలే కోపం మీద వున్న నెటిజన్స్ ఇక ఛాన్స్ దొరికిందని ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇక శ్వేతా బచ్చన్ బార్ నుంచి వస్తున్న ఆ వీడియోలో శ్వేతా బచ్చన్ తో పాటు నిర్మాత జోయా అక్తర్ కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: