ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బాహుబలి సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకుంది. అందుకే.. బాహుబలి ప్రీక్వెల్ ను యానిమేషన్ సిరీస్ గా ప్లాన్ చేశారు. శివగామి కథను ఒక సిరీస్, బాహుబలి రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఒక సిరీస్ గా ప్లాన్ చేశారు.

ఈ సిరీస్ చెయ్యడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా లాంటి ప్రతిభ గల  డైరెక్టర్స్ చేతిలో ఈ ప్రాజెక్ట్ ను పెట్టింది. అయితే.. విడుదలైన మొదటి సీజన్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. పైగా.. వచ్చిన ఫుటేజ్ తోనూ టీమ్ మెంబర్స్ హ్యాపీగా లేరట. అందుకే.. ఆ ప్రాజెక్ట్ ను ఆపేసి, అప్పటివరకు ఖర్చైన కోట్ల రూపాయలు వృధా అయినా పర్లేదు అనుకొని మళ్ళీ కొత్తగా సిరీస్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది.

మరి ఈసారి ఎలాంటి ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ప్లాన్ చేస్తుందో  ఏ స్థాయిలో నిర్మిస్తుందో అనేది చూడాలి. ఇకపోతే.. బాహుబలి యానిమేషన్ సిరీస్ ను మాత్రమే కాక యానిమేషన్ బుక్స్ ను కూడా లాంచ్ చేసే పనిలో ఉన్నారు బృందం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: