ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటి తాప్సీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  తెలుగు చిత్ర పరిశ్రమకి మొగుడు అనే సినిమాతో గోపీచంద్ సరసన నటించి హీరోయిన్ గా పరిచయమైంది తాప్సి. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.  తాప్సి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ పై కన్నేసిన అక్కడ అడుగుపెట్టింది.


 ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్ కి ఎంతగానో అదృష్టం కలిసి వచ్చింది అనే చెప్పాలి. సాధారణంగా ప్రతి నటికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కొంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంటూ ఉంటారు. ఈ అమ్మడు విషయంలో ఇదే నిజం అయ్యింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  పలు వైవిధ్యమైన సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులు అందరిని ఆకర్షించింది తాప్సీ పన్ను. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో  నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేసుకుంటూ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది తాప్సీ పన్ను. వరుస అవకాశాలు అందుకుంటుంది.




 అయితే కేవలం ఏడు నిమిషాల వల్లే తన కెరియర్ మారిపోయింది అంటూ తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. తన కెరీర్ గురించి అభిమానులతో ఒక కీలక విషయాన్ని తెలిపింది.  అంతేకాదు సినిమాల్లోకి రావాలి అనుకునే నటీనటులు అందరికీ కూడా ఒక మంచి సలహా ఇచ్చింది. ప్రియమైన నటీనటులారా..  తెరమీద ఎంతసేపు కనిపించామన్నది   కాదుపాత్రలో ఒదిగిపోయి ఎంతలా  ప్రభావితం చేసాము అన్నది ముఖ్యం అంటూ తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ తో  కలిసి 2015 లో వచ్చిన సినిమాలో   ఏడు నిమిషాల నటించడం వల్లనే తన కెరీర్ ముందుకు వెళ్ళింది అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: