సినిమా పరిశ్రమలో ఓ ఇద్దరు హీరో హీరోయిన్లు సన్నిహితంగా ఉంటే వారి మధ్య ఎఫైర్ ను అంటగడుతు ఉంటారు. ఇప్పటి దాకా చాలామంది హీరో హీరోయిన్లు ఈ విధమైన వార్తలను ఎదుర్కొన్న వారే. తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు హాట్ ఎఫైర్ నడిపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వారేవరో కాదు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు రెండు సినిమాల్లో చేయడంతో వారి మధ్య ఎఫైర్ నడుస్తుంది అని కొంతమంది భావిస్తున్నారు.

దానికి తోడు కొన్ని ప్రైవేటు ప్రదేశాలలో వీరిద్దరూ కలిసి ఉండడం అది కెమెరాకు చిక్కడం వంటివి జరగడంతో వీరిద్దరి మధ్య నిజంగానే సంబంధం ఉంది అని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. తొలిసారిగా వీరిద్దరూ కలిసి గీతగోవిందం అనే సినిమాలో నటించారు ఆ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో చేసిన వీరిద్దరూ మంచి విజయాన్ని కూడా అందుకున్నారు. ఈ సినిమాలు చేసే సమయంలో వారు సన్నిహితంగా ఉండడం ఈ విధమైన వార్తలు రావడానికి కారణం అయ్యింది.

ముఖ్యంగా మీడియా ఈ విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి ఇది వారిద్దరి వ్యక్తిగత సంబంధమైన విషయమే అయినప్పటికీ సెలబ్రిటీలు కావడంతో వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో అన్న ఆసక్తి తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. తాజాగా మాల్దీవ్స్ లో వీరిద్దరూ కలసి కనబడడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందని అందుకే అక్కడికి వెళ్లారు అని చెప్పుకుంటున్నారు. మరి బయటకు ఎవరికి వారు వారిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని మేము కేవలం స్నేహితులు మాత్రమేనని చెప్పుకోవడం జరుగుతుంది. దీనిపై స్పష్టత వచ్చే అవసరం వారిద్దరికీ ఉందని చెప్పాలి. ఇక వీరు చేస్తున్న సినిమాలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా రష్మిక మందన బాలీవుడ్లో నటించిన గుడ్ బై సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: