బిగ్ బాస్ చరిత్ర లో మొట్టమొదటిసారి కంటెస్టెంట్స్ పై బిగ్ బాస్ అసహనం చూపుతూ డోర్లు తెరిచి ఇష్టం లేనోళ్ళు వెళ్లిపోండి అంటూ టాస్కులను రద్దు చెయ్యడం ఎప్పుడు జరగలేదట...కానీ నిన్న ఆ సందర్భం చోటు చేసుకుంది..బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కులను పక్కకి నెట్టి ఇద్దరు ముగ్గురు చేసిన గొడవకి కెప్టెన్సీ టాస్కు ని బిగ్ బాస్ రద్దు చేసే పరిస్థితి వచ్చిందట..


ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ ని బ్రతిమిలాడుకున్నారు..అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఏ మాత్రం కనికరించలేదు..ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ లో హౌస్ లోకి దొంగని ప్రవేశపెట్టి ఇంట్లో ఉన్న ఆహార పదార్దాలు అన్నిటిని పట్టుకుపొయ్యేలా చేసాడు..కనీసం పంచదార, ఉప్పు కూడా మిగిలించలేదట...రోజు మొత్తం ముద్ద అన్నం కూడా దొరకకపోవడం తో హౌస్ మేట్స్ మొత్తం ఆకలితో అలమటిస్తూ నీరసించి కూర్చున్నారు..అలాంటి సమయం లో బిగ్ బాస్ వాళ్లకి అదిరిపొయ్యే టాస్కుని ఇచ్చాడట.ఈ టాస్కు చూస్తే ఇది కదరా అసలు ఆట అని పేక్షకులకు అనిపించక తప్పదు.


గార్డెన్ లో ఒక్క కప్పు అన్నం మరియు పప్పు పెట్టాడు బిగ్ బాస్..అది చూడగానే శ్రీ సత్య 'ఫుడ్ వచ్చేసింది,ఫుడ్ వచ్చేసింది' అంటూ ఎగిరి గంతులు ఇస్తుంది..కానీ బిగ్ బాస్ అంత తేలికగా ఏమి ఇవ్వడు కదా..అన్నం తినాలంటే కచ్చితంగా దానికోసం పోరాడాల్సిందే అంటూ కొత్త షరతులు పెట్టాడట...రెండు గ్రూప్స్ గా విడిపోయి కబడ్డీ ఆడాలి..గెలిచినా వారికే అన్నం దక్కుతుంది అంటాడు బిగ్ బాస్..అలా ఈరోజు టాస్కు ఆసక్తికరంగా సాగబోతోందట..నిన్న బిగ్ బాస్ కి అంత కోపం వచ్చి కెప్టెన్సీ టాస్కు ని ఆపేయడానికి ముఖ్య కారణం రేవంత్ మరియు అర్జున్ మధ్య జరిగిన గొడవే అని చెప్పొచ్చు..వీళ్లిద్దరి మధ్య గొడవ పెట్టింది మాత్రం శ్రీ సత్యనే.


 


ఈ వీకెండ్ లో నాగార్జున గారి చేతిలో వీళ్లకు బడిత పూజ తప్పేలా లేదు..ఇక వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి రేవంత్ , శ్రీహన్ , శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ,ఆది రెడ్డి, కీర్తి ,వాసంతి, రాజ్ శేఖర్ , మెరీనా,ఫైమా , ఆదిత్య , ఇనాయ సుల్తానా ,రోహిత్ నామినేట్ అయినా విషయం మన అందరికి తెలిసిందే..వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలియాలంటే వీకెండ్ వరుకు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: