2014 వ సంవత్సరం అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీ జూనియర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ ముఖ్య పాత్రలలో నటించారు. రావు రమేష్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా గీతాంజలి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించారు.

ఇందులో కూడా అంజలి ప్రధాన పాత్రలో నటించగా శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ , వెన్నెల కిషోర్ , సత్యమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడం , ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాను మే 10 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: