పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన సినిమా “ఓజీ”. ఈ సినిమాలో ప‌వన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు సుజీత్ తన స్టైల్‌లో రూపొందించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆయన నుంచి గంభీరత, మాస్ అటిట్యూడ్ కలిగిన సినిమా కోసం ఎదురుచూస్తుండగా, “ఓజీ” ఆ గ్యాప్‌ను ఫుల్ మీల్స్‌తో భర్తీ చేయబోతోందని ట్రైలర్స్, పోస్టర్స్ చూపించిన ఎగ్జైట్‌మెంట్ చెబుతోంది. సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్ట్ చుట్టూ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ నెలకొంది. మొదటి లుక్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్నీ ఒక్కొక్కటి విడుదలైనప్పుడల్లా సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో పవన్ పవర్ ఏ స్థాయిలో ఉందో చూపించాయి. అభిమానుల్లో ఉత్సాహం ఏ రేంజ్‌లో ఉందో చూస్తే, సినిమా థియేటర్స్‌లో బొమ్మ పడే క్షణం పండుగ వాతావరణంగా మారడం ఖాయం.


వసూళ్ల విషయానికి వస్తే, వరల్డ్ వైడ్‌గా “ఓజీ” భారీ ఓపెనింగ్స్ సాధించబోతోందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. నిన్నటికి ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ రు. 50 కోట్ల మార్క్ దాటగా, రిలీజ్ టైంకు రు. 75 కోట్ల దగ్గరకి చేరుకుందని సమాచారం. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ఫీనామినా కనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్, అలాగే సుజీత్ డైరెక్షన్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనం. థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను అత్యంత భవ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో నిర్మించింది. మొత్తానికి, “ఓజీ” విడుదల రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఒక ర్యాంపేజ్ సృష్టించి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమాకి కూడా కొత్త రికార్డులు తీసుకురావడం ఖాయం అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: