ఈ ప్రమాదంపై ప్రస్తుతం మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఎన్నో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఊహజనిత వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమాదం అలా జరిగిందని కొందరూ... ఇది ఉగ్రవాదుల కుట్ర అని మరికొందరు పోస్టులు చేస్తున్నారు కూడా. అసలు హెలికాఫ్టర్ సామర్థ్యంపై కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో భారత వాయుసేన స్పందించింది. ప్రమాదంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని సూచించింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కూడా భారత వైమానిక దళం... ఐఏఎఫ్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది భారత వాయుసేన. ప్రమాద ఘటనపై ఇప్పటికే దర్యాప్తు వేగంగా జరుగుతుందని... సాధ్యమైనంత త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై ఇప్పటికే వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్డు ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుందని... ఈ విచారణ త్వరలోనే పూర్తి అవుతుందని కూడా ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
ఈ ప్రమాదంపై ప్రస్తుతం మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఎన్నో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఊహజనిత వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమాదం అలా జరిగిందని కొందరూ... ఇది ఉగ్రవాదుల కుట్ర అని మరికొందరు పోస్టులు చేస్తున్నారు కూడా. అసలు హెలికాఫ్టర్ సామర్థ్యంపై కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో భారత వాయుసేన స్పందించింది. ప్రమాదంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని సూచించింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కూడా భారత వైమానిక దళం... ఐఏఎఫ్ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది భారత వాయుసేన. ప్రమాద ఘటనపై ఇప్పటికే దర్యాప్తు వేగంగా జరుగుతుందని... సాధ్యమైనంత త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై ఇప్పటికే వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్డు ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుందని... ఈ విచారణ త్వరలోనే పూర్తి అవుతుందని కూడా ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.