నిన్నటి దాకా బాబు బంగారం అంటూ తెగ హడావుడి చేశారు. అధికారంలో ఉన్నంత కాలం ఎవ్వరూ ఎవ్వరికీ దాసోహం కానక్కర్లేదు అని తెలుసుకోలేకపోయారు. ఒక్కసారి అధికారం పోయాక మాత్రం బాబు ఒంటరి అయిపోయారు. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఎవ్వరికీ పట్టని విధంగా మారిపోయారు. కానీ ఆరోజు సెక్రటేరియట్ డ్రామాలు గుర్తుకు తెచ్చుకుంటే అసలు కథ ఏంటన్నది తప్పక అర్థం అవుతుంది. ఆ రోజు ఫైళ్లనూ, అధికారులనూ చూసిన విధానం ఒకటి తరచి చూస్తే సిసలు విషయం తప్పక తెలుస్తుంది.
టీడీపీ జాతీయ ఆఫీసు అన్నాక లేదా టీడీపీ జిల్లా ఆఫీసులు అన్నాక ఇంకొన్ని వివాదాలూ ఉంటాయి. వీటిని దాటుకుని బాబు రాలేకపోతున్నారు. అందుకే సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా ఇవాళ బాబుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
అంతేకాదు ఆ రెండు పార్టీల కుటుంబ పాలనకు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే నిలుస్తుందని అంటున్నారు సుజనా లాంటి ఇంకొందరు మాట్లాడుతున్నారు.
ఆఫీసు అన్నాక నిన్నటి దాకా అద్దాల మేడలే అనుకున్నారు బాబు..ఆఫీసు అన్నాక ఏసీ గదులే అనుకున్నారు బాబు.. వాటితో పాటు యుద్ధాలు అంతర్యుద్ధాలు అంతర్ముఖ ధోరణులూ ఇవన్నీ ఆఫీసుకు సంబంధించినవే కదా! మరి! వీటిపై ఆయనెందుకు దృష్టి సారించరు. కనుక ఆఫీసు అంటే మనం చుట్టూ మనుషులకూ, బయట మనం అనుకుంటున్న మనుషులకూ మధ్య ఉన్న తేడా అని ఎప్పుడు గ్రహిస్తారు బాబు.
టీడీపీ చుట్టూ ముళ్లున్నాయి..టీడీపీ ఆఫీసులో విరిగిపోయిన అద్దాలున్నాయి.. ఫర్నీచర్ కూడాఉంది. అన్నీ ఉన్నాయి కానీ ఆత్మ స్థైర్యమే లేదు. అందుకని మీరు బాధపడకండి బాబు గారూ! అది కూడా వస్తుంది. మీరు కాస్త పాత కాలం ఆలోచనలతో ఉన్న వారిని వదిలి ఉంటే..లేదా మీ అబ్బాయికి కాస్త పార్టీపై పట్టు వస్తే అన్నీ అవే సాధ్యం అవుతాయి బాబు గారూ! బాధ పడకండి.. నెవర్ ఫీల్ లైక్ దట్.