చక్కటి సౌకర్యాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కోన్నారు. ఎక్కడైతే వేగం అధికంగా ఉంటున్నాయో ఆ ప్రదేశాల్లో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని... అలాగే కూడళ్ల వద్ద ఎల్ఇడి దీపాలను ఏర్పాటు చేయాలని కూడా జిల్లా అధికారులను ఎంపీ రామ్మోహన్ ఆదేశించారు. వేగ నియంత్రణకు ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్... ఏటిఎంఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకులకు తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు, వివిధ ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటుకు పార్లమెంట్ సభ్యులు నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రహదారి భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాలను విస్తృతస్థాయిలో పెంచుకోవాలని తద్వారా ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం, కుటుంబాలకు భరోసాగా నిలవాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అదేసమయంలో ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్ లు అవసరం ఉందని వాటిని ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పనులు పూర్తి అయిన వెంటనే రహదారి భద్రత కమిటీ సభ్యులతో పాటు తనిఖీ చేస్తామని ఆయన చెప్పారు.
రహదారి ప్రమాదాల్లో చిక్కుకున్న వ్యక్తులకు తక్షణ సహాయం చేస్తున్న మానవతా వాదులకు ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు యుద్ధప్రాతిదికన ఆసుపత్రుల్లో చేర్పించడం, సహాయం చేయడం వలన ఒక నిండు జీవితానికి పునర్జన్మ అందించినట్లు ఉంటుందని చెప్పారు. మానవతావాదులను సముచితంగా గౌరవించడం జరుగుతుందని చెప్పారు.