వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. వినకుడిని నిమజ్జనం చెయ్యడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.ఇక హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్ మంగళవారం నాడు బీఆర్కేఆర్ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఇంకా అలాగే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్ ఇంకా హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్ ఇంకా అలాగే మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇంకా అలాగే కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇక ఈ సందర్బంగా సీఎస్‌ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, కాబట్టి ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. 



ఇక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇంకా సింథటిక్ కలర్లు ఇంకా అలాగే పర్యావరణ హాని కారక కెమికల్స్‌ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.అలాగే పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని సీఎస్‌ వివరించడం జరిగింది. ఇక ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని కూడా ఆయన సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు కూడా తగు ప్రోత్సాహం అనేది ఇవ్వాలని సీఎస్‌ సూచించారు. హైకోర్టు ఇంకా అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పాటించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: