ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులంతా జగన్ పై కక్ష గట్టారు. తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని వీరంతా అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు. దీనికి ప్రతిగా రాష్ట్రంలోని హిందూ దేవాలయాలలో విగ్రహాలను కూల్చడం మరియు హిందూ వ్యతిరేక కార్యక్రమాలను చేయడం వంటివి చేసి తద్వారా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రామతీర్థంలో జరిగిన రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం. దీనిపై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ప్రతి పక్ష నాయకులు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం. వీరేమో వారిపై ఆరోపణలు చేయడానికే సరిపోయింది. అయితే వాస్తవం ఏమి జరిగిందనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ విషయాన్ని బయటపెట్టడానికి సీఐడీ విచారణ ప్రారంభించింది. దీనికి మంగళవారం సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  అధికారుల నుండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని మీడియా వారితో ఈ విధంగా మాట్లాడారు...ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం చేసిన చర్య అని, ఈ ఘటన ప్రభుత్వం పై వారికున్న కక్షను తెలియచేస్తుందని తెలిపారు.

  అంతే కాకుండా ఈ దుశ్చర్యకు ఉపయోగించిన రంపం దొరికిందని అలాగే మరి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇది ఒక వేళ దొంగతనం గనుక అయితే గుడిలో ఎటువంటి నగలు కానీ ఇతరత్రా వస్తువులు కానీ వారు తీసుకోలేదని, కేవలం రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇది చేసారని, అతి త్వరలోనే నిస్పక్షపాతంగా దర్యాప్తును జరిపి దీనికి కారణమయిన దుండగులను పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనితో రాష్ట్రంలో కొంతమేర ఈ ఘటన గురించి ప్రజలకు భరోసా లభించింది. ఇంతకీ ఎవరు చేసారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: