
ఇండియా మిస్సైల్ల దాడిలో అజార్ ఫ్యామిలీ మొత్తం చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పదిమంది కుటుంబ సభ్యులు అలాగే ఆయన అనుచరులు నలుగురు మొత్తం మరణించారని తెలుస్తోంది. ఇక మృతులలో మసూద్ అజార్ సోదరి అలాగే బావ కూడా ఉన్నట్లు సమాచారం. బహవల్పూర్ లోని జైషే హెడ్ క్వార్టర్స్ పైన భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే అతడు ఉంటున్న హెడ్ క్వార్టర్స్ మొత్తం కుప్పకూలింది.
ఇక ఈ దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ సంచలన లేఖ కూడా విడుదల చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారని ఫైర్ అయ్యాడు. నాకు భయం లేదు, నిరాశే లేదు విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇండియాను నాశనం చేసి ప్రధికారం తీర్చుకుంటానని మసూద్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ లేఖ వైరల్ గా మారింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు