ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుంది. 2జి నెట్వర్క్ నుంచి మొదలు 5జి నెట్వర్క్ 6జి నెట్ వర్క్ వైపు అడుగులు వేసే విధంగా ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నెట్వర్క్ చాలదన్నట్టు చాలావరకు వైఫైలు కూడా  వచ్చాయి. అయితే ఇంతవరకు మనకు మొబైల్ ఫోన్ లో కానీ లాప్ టాప్ లో ఇతర ఇంటర్నెట్ ను వాడే పరికరాలకు నెట్ సిగ్నల్ అనేది టవర్స్ నుంచి వచ్చేది. లేదంటే ఒక వైఫై రూటర్ పెట్టుకుంటే దాని నుంచే ఆ సరౌండింగ్ మొత్తం సిగ్నల్స్ వచ్చేవి. ఒక ఆఫీస్ లో మనం రూటర్ అమరిస్తే ఒక రూమ్ లో సిగ్నల్ ఎక్కువగా ఉండేది,మరో రూంలో సిగ్నల్స్ తక్కువగా ఉండే సమస్యలు ఉండేవి. అలాంటి ఈ తరుణంలో వైఫై లాగానే మరో సిగ్నల్ సంస్థ  వచ్చింది. దాని పేరే లైఫై.. దీన్ని గుజరాత్ కు చెందిన నావ్ వైర్లెస్ టెక్నాలజీస్ వారు అభివృద్ధి చేస్తున్నారు..


 అయితే ఈ కంపెనీ తన యొక్క వినియోగాన్ని అమెరికాలోని ప్రభుత్వ సంస్థలు, ఆస్పత్రులు మరియు వివానాశ్రయాలు వంటి బహుళ రంగాలలో విస్తరించాలని కూడా ఆలోచన చేస్తోంది. ఈ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా న్యూయార్క్ నగరంలో  ప్రారంభించినట్టు తెలియజేసింది. బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీ జెస్కో వెంచర్ ల్యాబ్స్ సహకార ప్రయత్నంలో న్యూయార్క్ లోని సిలికాన్ హర్లేం కార్యాలయంలో ఈ సాంకేతికతను ఏర్పాటు చేసినట్టు నావ్ వైర్లెస్ సంస్థ తెలియజేసింది.  అయితే ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు  సోనీ మాట్లాడుతూ.. న్యూయార్క్ లో లైఫైని ప్రారంభించడం  ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్నారు. ముఖ్యంగా భారతదేశానికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన నొక్కి చెప్పారు.

వేగవంతమైన, సురక్షితమైన నెట్వర్క్ కోసం ఇది తీసుకువచ్చామని అన్నారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణలు ప్రపంచ డిజిటల్ భవిష్యత్తును పునర్నిర్వచించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలియజేశారు. వైఫై కి లైఫైకి ప్రధాన తేడా కూడా ఆయన తెలియజేశారు. అయితే వైఫై  రేడియో ఫ్రీక్వెన్సీ లను ఉపయోగించి పనిచేస్తుంది. లైఫే టెక్నాలజీ డేటాను ప్రసారం చేయడానికి దృశ్య కాంతిని ఉపయోగిస్తుంది. ఇది వైఫైతో పోలిస్తే అధిక సురక్షితమైనదే కాకుండా అత్యధిక స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. ఈ లైఫై అనేది ఎల్ఈడి లైటింగ్ పై ఆధారపడి పని చేస్తుందని సోనీ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: