తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ కీలక నేత పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితం రాజీనామా చేశారు. కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నేతల పై తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కొనియాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈటల కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారు అంటూ కూడా  పాడి కౌశిక్ రెడ్డి బాంబులు పేల్చారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అంటూ ఆయన హెచ్చరించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెయ్యిరెట్లు బెటర్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: