భారత దేశంలో ఇప్పుడు కరోనా తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.  ఇప్పుడు రోజూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయ. ఓవైపు లాక్ డౌన్ నియమనిబంధనలు పాటిస్తున్నా కరోనా వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.  అసలే కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు  దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. 

 

కాగా, భూకంప కేంద్రం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ మధ్యాహ్నం భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని వాతావరణ విభాగం తెలిపింది. గతంలో కూడా భూ కంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. గతంలో సంభవించిన రెండు భూకంపాల కేంద్రం ఒకే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: