తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు ఈ నెల 12 నుండి ( రేపటి నుండి ) పది రోజుల పాటు పది రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. సర్కార్ ప్రకటనతో ముఖ్యంగా మందు బాబులు వైన్ షాపుల ముందు ఎగబడ్డారు. అయితే మందు బాబులకు తెలంగాణ సర్కార్ కాస్త ఊరటనిచ్చింది. లాక్ డౌన్ లో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వైన్ షాప్ లకు కరోనా మార్గదర్శకాలలో మినహాయింపు కలిగించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ వార్తతో మందు బాబులు నిట్టూర్పు విడిచారనే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: