ఈ మధ్య కాలంలో జగన్ ని వరుస లేఖలతో టార్గెట్ చేస్తున్నారు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన ఆరవ సారి లేఖ రాశారు. ఉద్యోగులకు డీఏ పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని లేఖలో రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు బకాయి పడ్డ 7 డీఏలు వెంటనే అమలు చేయాలని, అలాగే కరోనా కారణంగా డీఏ పెంపు వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే ఆ విషయం ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.


 ఇక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యం అవుతోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు పై వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని వైస్ జగన్ ని లేఖలో కోరారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: