మధుమేహం సమస్యతో బాధ పడేవారికి కొన్ని వంటింటి మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం.దాల్చిన చెక్క అనేది డయాబెటీస్ రోగులకు ఔషధం లాగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా ఈజీగా అదుపులో ఉంచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోకుండా కూడా ఇది చేస్తుంది. మీరు దీన్ని తినాలనుకుంటే ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపి తీసుకుంటే చాలా మంచిది.ఇంకా ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో కొత్తిమీర గింజలు సహాయపడతాయని, అలాగే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలోని జీవక్రియ, హైపోగ్లైసీమిక్ ప్రక్రియను బాగా మెరుగుపరుస్తాయని, అంతేగాక ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుందని చాలా రకాల పరిశోధనలలో తేలింది. కొత్తిమీర గింజలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. ఇక ఇది మధుమేహ రోగులకు కూడా చాలా ముఖ్యమైనది. మీరు దీనిని ఉపయోగించాలంటే ఉపవాస సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కొత్తిమీర గింజలు వేసి ఉదయం పూట నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అలాగే ప్రతి రోజూ మెంతి నీళ్లను తాగితే టైప్-2 మధుమేహాన్ని చాలా ఈజీగా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఈ మసాలాలో చాలా ఫైబర్ ఉంది. దీని కారణంగా జీర్ణక్రియ అనేది నెమ్మదిగా మారుతుంది.అప్పుడు కార్బోహైడ్రేట్లు ఇంకా చక్కెర శోషణ కూడా నియంత్రించబడుతుంది.ఇందుకోసం ఒక చెంచా మెంతికూరను ఒక చిన్న గిన్నెలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయం పూట నిద్రలేవగానే వడగట్టి  తాగితే మంచి ఫలితం ఉంటుంది.ఇంకా పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. ఈ మసాలాలో యాంటీఆక్సిడెంట్ ఇంకా అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా పసుపు పాలు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: