సరైన హిట్ సాధించేందుకు పరితపించి పోతున్నాడు. ప్రస్తుతం మిగతా యువ హీరోలతో పోలిస్తే హెట్ కి ఎంతో దూరం ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ ఆశలన్నీ ఒరేయ్ బుజ్జి గా అనే సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఇటీవలే ఆహా ఓటీటి వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా యువ హీరో రాజ్ తరుణ్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు రాజ్ తరుణ్.
దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో అలీ అడిగిన ఓ ప్రశ్నకు... షాకింగ్ సమాధానం చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కుమారి 21 ఎఫ్ సినిమా లో... ఓ పాటలో బ్యాడ్ బాయ్స్ బ్యాంకాక్ వెళ్తారు అన్న లిరిక్స్ ఉంటుందని... మరి నువ్వు ఎప్పుడైనా బ్యాంకాక్ కు వెళ్ళావా అంటూ అలీ రాజ్ తరుణ్ ని అడిగాడు. అయితే తాను బ్యాడ్ బాయ్ నే అంటూ తెలిపిన రాజ్ తరుణ్ బ్యాంకాక్ కూడా వెళ్లాను అంటూ చెప్పుకొచ్చాడు.