నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంశం ఏదయినా ఉందంటే అది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఎందుకంటే నంద‌మూరి వంశం నుంచి కొత్త హీరో వ‌చ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి కొత్త ఫేస్ రాలేదు. దాంతో మోక్ష‌జ్ఞ కోస‌మే అభిమానుల ఎదురుచూపులిప్పుడు. దాంతో ఆయ‌న ఎప్పుడెప్పుడు వ‌స్తాడా అని చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. మొన్నామధ్య బాలకృష్ణ కుమారుడుతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మళ్ళీ ప్రచారం మొదలయింది. ఇప్పటికే ఆయన కోసం బాలక్రిష్ణ కథలు వింటున్నాడని, డైరెక్టర్లతో మాట్లాడుతున్నాడని రకరకాల ప్రచారం మొదలయింది. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ లాంచింగ్‌ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో బాలయ్య అభిమానుల్లో కొత్త కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజానికి జూ ఎన్టీఆర్ 18 ఏళ్లకే హీరో అయిపోయి ట్వంటీస్‌ వచ్చేనాటికే సూపర్‌ స్టార్డమ్‌ తెచ్చుకున్నాడు. కానీ మోక్షజ్ఞ 26 ఏళ్లు వచ్చినా ఇంకా తెరపైకి రాట్లేదు. అయితే మోక్షజ్ఞ కరోనా తర్వాతైనా సినిమాల్లోకి వస్తాడా ? లేదా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

కొత్త అనుమానం ఏంటంటే ఈయన అసలు సినిమాల్లోకి వస్తాడా ? లేక తండ్రి పొలిటికల్ వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోతాడా ? ఎటూ బావ లోకేష్‌ రాజకీయాల్లో ఉండడంతో ఈయన కూడా అటేమన్నా చూస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో నందమూరి సారధ్యం లేదని విమర్శలు గట్టిగానే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈయన బావతో కలిసి పార్టీ బాధ్యతలు చూసుకుంటాడని కూడా ప్రచారం జరుగుతోంది. మరి బాలయ్య ఏం చేస్తాడో అసలు కొడుకుని కెమెరా ముందుకు తీసుకొస్తాడా లేక మైకు ముందుకు తీసుకోస్తాడా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: