మంచులక్ష్మీ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా గుండెల్లో గోదావరి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ  చిత్రం ఆడియో విడుదల వేడుక బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా నటి, నిర్మాత లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ‘నీకెందుకు సినిమా ?అన్నవాళ్లకు సమాధానం ఈ సినిమా’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, కీరవాణి, డి.కె.అరుణ, విష్ణు, మనోజ్, ఆది, ఎస్.గోపాల్ రెడ్డి, బి.గోపాల్, కోటి, రమేష్ ప్రసాద్, జయసుధ తదితరులు పాల్గొన్నారు. ఈ గుండెల్లో గోదావరి సినిమాకు కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించారు. ఆది, సందీప్ కిషన్, లక్ష్మీ ప్రసన్న, తాప్సీ, తదితరలు నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: