ధనుష్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన మారి 2 సినిమాలోని "రౌడీ బేబీ" సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇదే పాటను సందీప్ కిషన్ నటిస్తున్న తదుపరి సినిమా టైటిల్ గా ఖరారు చేశారు. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన 'రౌడీ బేబీ' టైటిల్ లోగో తో పాటు షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నదని కోన ఫిలిం కార్పొరేషన్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకి జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా కోన వెంకట్ నిర్మిస్తున్నారు. చౌరస్తా రామ్ సంగీత బాణీలు సమకూర్చనున్నారు అని తెలిపారు. కానీ ఈ సినిమా షూటింగు ఇంకా ప్రారంభం కాలేదు.


ఈ నేపథ్యంలోనే తమ సినిమా టైటిల్ ని చేంజ్ చేస్తున్నామని.. మరొక ఆసక్తికరమైన టైటిల్ త్వరలోనే ఖరారు చేస్తామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే సందీప్ కిషన్ సినిమాకి రౌడీ బేబీ పేరుని ఖరారు చేయడం తో దిల్ రాజు ఫిలించాంబర్ లో తీవ్ర అభ్యంతరం తెలిపారట. ఎందుకంటే.. దిల్ రాజు కి శిరీష్ అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఐతే ఆయన కుమారుడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అయితే ఆ కుర్ర హీరో తొలి చిత్రానికి రౌడీ బాయ్ అనే టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయించారు.


అయితే సందీప్ కిషన్ రౌడీ బేబీ, దిల్ రాజు బంధువు రౌడీ బాయ్ సినిమాల పేర్లు ఒకే లాగా ఉండటంతో సమస్య వచ్చి పడింది. ఈ విషయంలో దిల్ రాజు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలపడం తో ఇక చేసేదేమీ లేక సందీప్ కిషన్ చిత్ర బృందం ఈ టైటిల్ ని మార్చుకునేందుకు రెడీ అయ్యిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇటీవల A1 ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ యావరేజ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: