ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రాష్గ్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తేరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.  

మూవీ లో మలయాలే నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతి నాయకుడు పాత్రలో నటించగా ,  సునీల్ , అనసూయ ,  రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలో ఈ మూవీ లో నటించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. సమంతమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సాయి పల్లవి 'పుష్ప ది రూల్' మూవీ లో ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: