సినిమా పరిశ్రమలో వెరైటీ చిత్రాలు చేసే హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు అడవి శేష్. ఇటీవల కాలంలో ఆయన చేసిన మేజర్ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను ఈ ఏడాది మరొకసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

శైలేంద్ర దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధమయ్యింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇన్ని రోజులు హోల్డ్ చేయగా ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. దీనికంటే ముందుగా వచ్చిన హిట్ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా నటించిన ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఆ స్థాయిలోనే విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం భావిస్తుంది. ఇకపోతే హిట్ సినిమాకు సీక్వెల్ గా బాలీవుడ్ లో కూడా ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను పలకరించలేదు. ఈ నేపద్యంలో ఈ సినిమా తప్పకుండా వారిని అరదిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో వారిని ఆకట్టుకుంటుందో చూడాలి. ఇలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అడవి శేష్ ఈ చిత్రాన్ని ఒప్పుకోవడం విశేషం కాగా ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: