నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వీర సింహారెడ్డి మూవీ కి సంబంధించిన హై యాక్షన్ సన్నివేశాలను మూవీ యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హై యాక్షన్ సన్నివేశాలను వెంకట్ ప్రభు మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. వీర సింహారెడ్డి మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించ నుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: