టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో పాటు ఇటు అన్ స్టాపబుల్ టాక్ షో తో కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు.ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు బాలయ్య. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ను కూడా మొదలు పెట్టేశారు. ఇక ఇదిలా ఉంటే మరో వైపు అన్ స్టాపబుల్ షో ను కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఇక అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ని ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2ని కూడా అదే ఎనర్జీ తో రన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు యంగ్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యి బాగా సందడి చేశారు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ కు హాజరయ్యాడు. ఆయన తన మిత్రుడు గోపీచంద్ తో కలిసి ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యాడు.


ఇక అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తమ అభిమాన హీరోను ఎప్పుడు ఈ షోకు పిలుస్తారా అని ప్రశ్నిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బాలయ్య షోకు ఎన్టీఆర్ రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కూడా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ సందడి చేస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక  మా హీరోని బాలయ్య షోకి ఎప్పుడు పిలుస్తారు అని ప్రశ్నిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు ఎన్టీఆర్ త్వరలోనే అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా వస్తాడేమో చూడాలి.ఇక బాల కృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హాట్ బ్యూటీ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ గ్లిమ్ప్స్ ఇంకా పాటలు పై అంచనాలను క్రియేట్ చేశాయి. అటు తారక్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: