దర్శక ధీరుడు అయిన రాజమౌళి పేరు పాన్ వరల్డ్ లో మారు మోగుతోంది. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడం తో ప్రపంచం నలుమూలల నుంచి రాజమౌళిని కీర్తిస్తున్నారు. ఆస్కార్ అంచుల వరకు వెళ్లడమే గగనమనుకుంటున్న తరుణంలో ఏకంగా అవార్డును కొట్టుకొచ్చిన రాజమౌళి పై పొగడ్తల వాన కురిపిస్తున్నారు. ఈ సమయంలో రాజమౌళి పర్సనల్ విషయాలపై తీవ్ర చర్చ అయితే సాగుతోంది. ఈ క్రమంలో ఆయన చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నే ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తుంది.

ఈ ఫొటో లో ఉన్న నలుగురి వ్యక్తుల్లో సర్కిల్ లో ఉన్నాయనే రాజమౌళి. తన స్నేహితులతో ఓ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న ఫొటో అది. రాజమౌళి ది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. కానీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కర్ణాటక కు మారారటా.ఈ క్రమంలో విజయేంద్రప్రసాద్ దంపతులకు 1973లో కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా అమరేశ్వరి క్యాంప్ లో రాజమౌళి జన్మించారటా.. అయితే రాజమౌళి విద్యాభ్యాసం మాత్రం ఏపీలోని ఏలూరు, విశాఖపట్నంలోనే సాగిందని తెలుస్తుంది.. రాజమౌళి చదువుతున్నంతకాలం స్నేహితులతో సరదాగా ఉండేవారటా.వారితో షికార్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసేశారు.

చదువు పూర్తయిన తరువాత జక్కన్న  తన కెరీర్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. తండ్రి విజయేంద్రప్రసాద్ రచయిత అయినందువల్ల ఆయన కూడా సినిమాల్లో రాణించాలని అయితే అనుకున్నారు. అయితే కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాజమౌళిని హీరోగా నటించాలని అయితే కోరారు. కానీ ఆయనకు హీరో అవడం ఇష్టం లేదని చిరునవ్వుతో నే తిరస్కరించేవారు. ఆ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర శిక్షణ తీసుకొని 2001లో స్టూడెంట్ నెంబర్ సినిమాతో డైరెక్టర్ గా మారారు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను కూడా పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: