టాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఇద్దరే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్న ల గురించే ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు ఈ సంక్రాతికి వచ్చిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక తన ఖాతాలో హిట్ ని వేసుకోగా అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే అద్భుతమైన సక్సస్ ని తన అకౌంట్ లో వేసుకుంది. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యాం లో నటిస్తుంది. ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీటయింది. 

 

అంతేకాదు బాలీవుడ్ లో స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న మూడు సినిమాలు భారీ సినిమాలే. ఇక కన్నడ బ్యూటి రష్మిక మందన్న సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఇదేమి చిన్న సినిమా కాదు. అయిదు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా. ఇది నిజంగా రష్మిక మందన్నకి గోల్డెన్ ఛాన్స్. ఇక ఈ సినిమా కాకుండా త్రివిక్రం ఎన్.ట్.ఆర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన అయినను పోయిరావలె హస్తినకు సినిమాలో నటించే అవకాశాలున్నాయని సమాచారం.

 

అయితే తాజా పరిణామాలు చూస్తే రష్మిక లక్కీ హీరోయిన్ అంటున్నారు. అందుకు కారణం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు. ఈ దెబ్బతో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో లెక్కలన్ని మారిపోయాయి. ముఖ్యంగా భారీగా బెడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కాస్తవ వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు హీరో హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లో కొంత కోత పడనుందని తెలుస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ రెమ్యూనరేషన్ సగం తగ్గే అవకాశాలున్నాయట. ఇది రష్మిక కి ప్లస్ అయ్యోలా కనిపిస్తుందని అంటున్నారు. రష్మిక కంటే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఎక్కువ. దాంతో పూజా హెగ్డే గనక కాంప్రమైజ్ అవకపోతే నెక్స్ట్ ఛాయిస్ రష్మిక నే. ఈ విధంగా కాస్త కాంప్రమైజ్ అయితే రష్మిక పూజా హెగ్డే ని అడ్రస్ లేకుండా చేసే మంచి అవకాశం ఇదే అంటున్నారు.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: