ఇక కొరటాల శివతో ఎప్పటినుండో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ఇప్పటికే ఓ సినిమా మొదలై ఆగిపోయింది. దీంతో ఈసారి కొరటాలతో ఎలాగైనా సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ‘ఆచార్య’ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు కొరటాల. ఆ తరువాత చరణ్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్, కొరటాల సినిమాల కంటే ముందుగా రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి. అది ఎవరితో చేయనున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలను అప్రోచ్ అయ్యాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. త్వరలోనే చరణ్ ని కూడా సంప్రదించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ రామ్ చరణ్ కి నచ్చిందని.. వీరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి చరణ్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి! ఇలాంటి మరిన్ని న్యూస్ ల కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...