రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా "రాధే శ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా స్టోరి ఏంటి అనేది రివీల్ చేయలేదు. అయితే ఆ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా అని ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాదు సగటు సినీ అభిమానులకు కూడా ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఆ సినిమా స్టోరీ ఏంటో తెలియనప్పటికీ సినిమా లైన్ ఏంటి అనేది లీక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ స్టోరీ లైన్ ఏంటి? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా "రాధే శ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు "జిల్" మూవీ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి లేదా వేసవిలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, తాజాగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అన్నీ ఆకట్టుకున్నాయి. అయితే అవి కాపీ ఆరోపణలు, ట్రోల్స్ ను ఎదుర్కొన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీ లీక్ అవకుండా మూవీ టీమ్ ఇప్పటివరకు చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సచిన్ కేడ్కర్ ఒక విషయాన్ని లీక్ చేశాడు. అయితే సినిమా స్టోరీ ఏంటో చెప్పనప్పటికి స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. "రాధే శ్యామ్" కథ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీ అని సచిన్ కేడ్కర్ అసలు కథ థీమ్ రివీల్ చేసేశారు. అయితే ఇప్పటి వరకూ ప్రభాస్ ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు. ఇది తెలిసిన ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చూడాలి మరి బాహుబలి తో నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: