నిజానికి సీజన్ త్రీలోనే ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారు అని అంతా గట్టిగా నమ్మారు. టాప్ యాంకర్ శ్రీముఖి సీజన్ త్రీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఆమెకే అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కూడా రన్నరప్ గానే చివరికి మిగిలిపోవాల్సివచ్చింది. ఇపుడు చూస్తే సీజన్ ఫోర్ లో విన్నర్ కాదు కదా రన్నర్ కూడా ఫిమేల్ అయ్యేలా చాన్స్ కనిపించడంలేదు.
ఇప్పటిదాకా హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్ల పేరేంట్స్, ఫ్రెండ్స్ కూడా విన్నర్ అయితే సోయెల్, లేకపోతే అభిజిత్ అని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ లాస్య కూడా అభిజిత్, సోయెల్ మధ్యలే పోటీ ఉంటుందని ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ చెప్పేశారు. మొత్తానికి చూసుకుంటే రన్నరప్ గా కూడా ఫిమేల్ వచ్చే అవకాశం లేదని అలా తేల్చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈసారి సీజన్ లో ప్రముఖ యాంకర్ లాస్య రావడం, అలాగే టీవీ 9 న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి రావడం తో పాటు చాలా మంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈ సీజన్ లో ఫిమేల్ కచ్చితంగా విన్నర్ అని అంతా అనుకున్నారు. ఇపుడు 11వ వారం తరువాత లాస్య కూడా ఎలిమినేట్ కావడంతో ఇక ముగ్గురు మాత్రమే ఫిమేల్ కంటెస్టెంట్లు మిగిలారు. ఈ ముగ్గురూ కూడా టాప్ టూలోకి వెళ్ళే చాన్సులు పెద్దగా లేవని అంటున్నారు. సో ఈసారి కూడా ఫిమేల్ కి విన్నర్ కిరీటం దక్కనట్లేనని ముందే డిసైడ్ అయిపోతున్నారంతా.