మన ఇండియా నుండి ఇప్పటికే మీనాక్షి శేషాద్రి, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, ఊర్వశి రౌతెలా, జుహీ చావ్లా, రకుల్ ప్రీత్ సింగ్, దియా మీర్జా వంటి వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కానీ కొంతమందికే టైటిల్ వరించింది. మరికొంత మంది మధ్యలోనే వెనుదిరిగారు. ఇక మిస్ ఇండియా వంటి పోటీల్లో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పాల్గొని విజేతగా నిలిచింది.
ఈ పోటీల్లో కొన్ని లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత కంటెస్టెంట్స్ ని జడ్జెస్ ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ చెప్పే సమాధానాలను బట్టి వారికి టైటిల్ దక్కుతుందా లేదా తెలుస్తుంది. ఇక ఈ పోటీలను యూట్యూబ్ లో కూడా పెడతారు. మిస్ ఇండియా పోటీలో భాగంగా నమ్రత ని ప్రశ్నలు అడిగిన వీడియో ఈ మధ్య వైరల్ గా మారింది. అందులో ఆమెను కోడి ముందా ? గుడ్డు ముందా ? అని అడిగి అది ప్రూవ్ చేయాలంటూ అడిగిన ప్రశ్న ఉంది. దీంతో నమ్రత కాస్త ట్రికీ గానే ఆన్సర్ ఇచ్చారు .కోడి అనేది లేకపోతే గుడ్డు ఎలా వస్తుంది అంటూ ఆమె చెప్పిన సమాధానం, నమ్రతకు మిస్ ఇండియా టైటిల్ ని గెలిచేలా చేసింది.
ఇక నమ్రత మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు సరసన వంశి సినిమాలో నటించి అతడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.