మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు . అప్పట్లో వరుస ఫ్లాప్ లతో సతమతమైన రవితేజ "క్రాక్" తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా విజయం తో రవితేజ రెమ్యునేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇక క్రాక్ హిట్ తరవాత గ్యాప్ లేకుండా రవితేజ ఖిలాడి సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . ఇదిలా ఉండగానే రవితేజ నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాకుండా మ‌రో సినిమాకు ర‌వితేజ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అయితే దానికి పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిఉంది.ఇదిలా ఉండగా మాస్ మహరాజ్ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ ముందు ఓటీటీ ద్వారా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారట . అల్లు వారి ఓటీటీ ప్లాట్ ఫామ్ "ఆహా" లో రవితేజ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్టు సమాచారం . 

ఈ వెబ్ సిరీస్ అల్లు అరవింద్ రవితేజ కలయికలో నిర్మిస్తారట. ముందుగా రవితేజ నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించారట. కానీ అల్లు అరవింద్ ఈ ప్రయత్నానికి బ్రేక్ వేసినట్టు టాక్. అంతే కాకుండా తన నిర్మాణం లో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని కూడా రవితేజ భావిస్తున్నారట. రవితేజ కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా సినిమాలను సైతం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు హీరోలు, దర్శకులు సైతం ఓటీటీ లలో సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారుc.  మరి సినిమాల్లో సక్సెస్ అయిన మాస్ మహరాజ్ నిర్మాతగా ఏ మేరకు అలరిస్తారో చూడాలిc.

మరింత సమాచారం తెలుసుకోండి: