టాలీవుడ్ లో నట వారసులకు కొదవలేదు. ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వీరితో పాటు ఇంకా చాలా మంది క్యూ లో ఉన్నారు. అయితే వారసులు అందరూ సక్సెస్ కొడుతున్నారా అంటే లేదు అని చెప్పాలి. దానికి చాలా విషయాలు కలసిరావాలి.

మంచి బ్యానర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్, చక్కని కధ ఇలా ఎన్నో కూడితేనే హిట్ వస్తుంది. అయితే అవన్నీ సమకూర్చి పెడుతూ హిట్ గ్యారంటీ అనే బ్యానర్ టాలీవుడ్ లో ఉంది. అదే మైత్రీ మూవీ మేకర్స్. చిన్న సినిమాలతో మొదలెట్టిన ఈ సంస్థ ప్రస్థానం ఇపుడు బడా హీరోల దాకా వచ్చింది. టాలీవుడ్ టాప్ రేంజి హీరోలతో సినిమాలు తీస్తూనే చిన్న హీరోలు, కొత్త హీరోలతో సినిమాలు తీస్తోంది.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారి తాజా బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన. ఈ మూవీ వంద కోట్ల దాకా కలెక్షన్లు వసూల్ చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది. ఈ మూవీలో హీరో మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ హీరో ఫస్ట్ మూవీయే ఇంతటి సూపర్ డూపర్ హిట్ కావడంతో అందరి కళ్ళూ మత్రీ మూవీ మేకర్స్ మీద పడ్డాయి. ఈ సినిమా హిట్ కావడం వెనక మెజారిటీ క్రెడిట్ అంతా మైత్రీ వారిదే అంటున్నారు. ఈ సినిమా మొత్తం వెనక ఉండి నడిపించిన తీరు, అన్ని జాగ్రత్తలు తీసుకుని సరైన టైమ్ లో రిలీజ్ చేసిన వైనం, ఇచ్చిన పబ్లిసిటీ ఇవన్నీ కలసి బ్లాక్ బస్టర్ ని చేశాయి.

దాంతో ఇపుడు నట వారసులు అంతా ఈ బ్యానర్ లో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అంతెందుకు బాలక్రిష్ణ తన నట వారసుడు మోక్షజ్ఞను కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద పరిచయం చేయాలని భావిస్తున్నాడు అంటున్నారు. బాలయ్య ఈ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఇపుడు ఆయనకు ఈ బ్యానర్ సొంతదిగా ఉందిట. అందుకే లక్కీ బ్యానర్ మీద తన కొడుకుని పరిచయం చేస్తే సంచలన విజయం దక్కుతుంది అని అంచనా వేస్తున్నారు అంటున్నారు.

ఇక చేసినవి నాలుగు సినిమాలు అయినా సరైన హిట్ లేని అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ కూడా బంపర్ హిట్ కోసం పరితపిస్తున్నాడు. అఖిల్ కూడా తొందరలోనే ఈ బ్యానర్ లో ఒక సినిమా చేయలాని ఆలోచిస్తున్నాడుట. మొత్తానికి టాప్ హీరోలకే కాదు, నట వారసులకు కూడా ఈ బ్యానర్ అంటే ఒక మోజు క్రేజూ ఉండడం మైత్రీ సంస్థ చేసుకున్న  అద్రృష్టం అని చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: