మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సహకారంతో సాగర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్. ఈ సినిమాని మలయాళం నుండి తెలుగులోకి రీమెక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రసుతం త్రివిక్రమ్ ఈ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పనులు ఎప్పుడు మొదలవుతాయో అనేది క్లారిటీ రాలేదు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు పవన్ నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇక గతేడాది మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు పోటీ పడగా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

అలాగే మహేష్ బాబుకు వచ్చే ఏడాది కూడా మెగా హీరోతో పోటీ తప్పడం లేదనే చెప్పాలి మరి. కాగా.. పవన్, మహేష్ లకు త్రివిక్రమ్ సన్నిహితుడు కావడంతో రెండు సినిమాలకు ఒక వారం గ్యాప్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఒక సినిమా కలెక్షన్లపై మరో సినిమా ప్రభావం పడే అవకాశాలు ఉండవు అని అనుకుంటున్నారు. అయితే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఈ హీరోలకు సంక్రాంతికి మరో రెండు సినిమాలతో పోటీ తప్పకపోవచ్చని తెలుస్తుంది.

అయితే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, సర్కారు వారి పాట సినిమాలకు థమన్ సంగీత దర్శకుడు కావడం గమనార్హం అనే చెప్పాలి మరి. ఇక అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ మేకింగ్ వీడియో తాజాగా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆగష్టు 9వ తేదీన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. కాగా.. ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: