సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ రోజు రోజుకు మన జీవతంలో భాగమైపోతున్నాయి.పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు వీటికి ప్రభావితులైయ్యారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాటిలో ఫేస్ బుక్ అంటే తెలియని వాళ్ళు లేరు.మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది జడ్చర్ల మండలం శంకరయ్యపల్లి సమీపంలో పదవ తరగతి విద్యార్థిని దారుణ హత్యకు గురైంది రెండ్రోజుల క్రితం హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ మాయలో పడి ఒక మైనర్ బాలిక జీవితం అర్ధాంతరంగా మిగిసిపోయింది.


ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడు విద్యార్థినిని హత్య చేసినట్లు గుర్తించారు జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ హౌసింగ్ బోర్డు లో ఉంటున్న రవిశంకర్ కుమార్తె మహబూబ్నగర్ కేంద్రీయ విద్యాలయం లో పదవ తరగతి చదువు తోంది అయితే ఆమెకు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ కు చెందిన నవీన్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు మూడ్రోజుల క్రితం అమ్మాయితో చాటింగ్ చేసిన నవీన్ రెడ్డి బయటికి రావాలని లేదంటే తల్లిదండ్రులకు చెప్పాలని బెదిరించాడు దీంతో నవీన్ రెడ్డి తో కలిసి బయటకు వెళ్లింది అయితే రెండ్రోజులుగా విద్యార్ధిని కనిపించటం లేదు తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటం తో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలిస్తున్నారు దర్యాప్తు లో భాగంగా బాలిక ఫేస్ బుక్ చెక్ చేసిన పోలీసులకు నవీన్ రెడ్డి చాట్ వివరాలు కనిపించాయి అనుమానంతో నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగు చూసింది


.ఈ విషయం తెలుసుకొని ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురైయ్యారు. వారి కూతురు ఇక తమకు లేదని తీవ్ర బాధను వ్యక్తం చేశారు. అదుపులోకి తీసున్న నిందితుడిని ఉరి తీయ్యాలంటూ ఆ ఊరి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: